PRINT TIME: March 16, 2026 03:14 AM
గోల్డ్ మెడల్ సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే పార్థసారధి అభినందనలు
గోల్డ్ మెడల్ సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే పార్థసారధి అభినందనలు
March 14, 2026 06:11 PM
10 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పతకం అందుకున్న ఎస్.కే. తస్లీమాను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అభినందించారు. శనివారం ఆమె నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక యువతి అయినప్పటికీ కష్టపడి, ఎన్నో రాత్రులు నిద్ర మానుకొని చదివి రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం గర్వకారణమన్నారు. తస్లీమా విజయానికి సహకరించిన తల్లిదండ్రుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
మైనారిటీ సమాజంలో ఉన్న బాలికలు విద్యపై మరింత దృష్టి పెట్టాలని, ప్రతి కుటుంబం తమ పిల్లలను చదివించాలని ఆయన ఆకాంక్షించారు. జర్నలిజం రంగంలో ముందుకు వెళ్లి మహిళల అభ్యున్నతికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన కలం ద్వారా పోరాడాలని తస్లీమాకు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి