Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:11 PM

గోల్డ్ మెడల్ సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే పార్థసారధి అభినందనలు

గోల్డ్ మెడల్ సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే పార్థసారధి అభినందనలు

గోల్డ్ మెడల్ సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే పార్థసారధి అభినందనలు
March 14, 2026 06:11 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పతకం అందుకున్న ఎస్‌.కే. తస్లీమాను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అభినందించారు. శనివారం ఆమె నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక యువతి అయినప్పటికీ కష్టపడి, ఎన్నో రాత్రులు నిద్ర మానుకొని చదివి రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం గర్వకారణమన్నారు. తస్లీమా విజయానికి సహకరించిన తల్లిదండ్రుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

మైనారిటీ సమాజంలో ఉన్న బాలికలు విద్యపై మరింత దృష్టి పెట్టాలని, ప్రతి కుటుంబం తమ పిల్లలను చదివించాలని ఆయన ఆకాంక్షించారు. జర్నలిజం రంగంలో ముందుకు వెళ్లి మహిళల అభ్యున్నతికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన కలం ద్వారా పోరాడాలని తస్లీమాకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News