PRINT TIME: March 11, 2026 08:28 PM
గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన గిడ్డంగుల సంస్థ చైర్మన్
గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన గిడ్డంగుల సంస్థ చైర్మన్
March 11, 2026 06:10 PM
11 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లోని గిడ్డంగుల సంస్థ గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గోడౌన్లలో నిల్వ చేస్తున్న సన్న బియ్యాన్ని పరిశీలించి వాటి నాణ్యత, నిల్వ పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన బియ్యం నాణ్యత సరిగా ఉందా లేదా అని పరిశీలించారు.
ఈ సందర్భంగా బియ్యం నిల్వల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని, నిల్వల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదని సంబంధిత అధికారులకు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి