గోండ్ర సతీష్ రెడ్డి మృతికి ట్రాక్టర్ అసోసియేషన్ నివాళి
గోండ్ర సతీష్ రెడ్డి మృతికి ట్రాక్టర్ అసోసియేషన్ నివాళి
Komidala Mahender reddy
చిట్యాల, జూలై 20:
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన గోండ్ర సతీష్ రెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందడం పట్ల శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సతీష్ రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే అసోసియేషన్ ప్రతినిధులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సతీష్ రెడ్డి సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా, సమాజంలో అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారని కొనియాడారు. ఆయన మృతి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఏర్పుల స్వామి, అధ్యక్షుడు గుంజ కృష్ణ, మాజీ గౌరవాధ్యక్షుడు కోనేటి కృష్ణ, కోశాధికారి సాగర్ల పవన్తో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొని తమ సంతాపాన్ని తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి