గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి
గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి
Editor Desk
గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధర్నా అనంతరం కొంతమంది కార్యకర్తలు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని, ఖమ్మంలో ఐటీడీఏను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, వైరా కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న గిరిజన భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.
జిల్లాలో భూసమస్యలు, ఉపాధి, విద్య సమస్యలను పరిష్కరించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
బోనకల్ మండలం రాయినూతల గ్రామంలో సాగు చేస్తున్న అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలని, ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆందోళనకు తెలంగాణ జాగృతి నాయకుడు బానోత్ కిషన్ నాయక్ మద్దతు తెలిపారు. అనంతరం గిరిజన సంఘం నేతలు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి