Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:40 PM

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి
30-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం కొంతమంది కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని, ఖమ్మంలో ఐటీడీఏను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, వైరా కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న గిరిజన భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.

జిల్లాలో భూసమస్యలు, ఉపాధి, విద్య సమస్యలను పరిష్కరించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

బోనకల్ మండలం రాయినూతల గ్రామంలో సాగు చేస్తున్న అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలని, ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆందోళనకు తెలంగాణ జాగృతి నాయకుడు బానోత్ కిషన్ నాయక్ మద్దతు తెలిపారు. అనంతరం గిరిజన సంఘం నేతలు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Sthanikam

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి

Article Image

గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం కొంతమంది కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని, ఖమ్మంలో ఐటీడీఏను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, వైరా కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న గిరిజన భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.

జిల్లాలో భూసమస్యలు, ఉపాధి, విద్య సమస్యలను పరిష్కరించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

బోనకల్ మండలం రాయినూతల గ్రామంలో సాగు చేస్తున్న అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలని, ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆందోళనకు తెలంగాణ జాగృతి నాయకుడు బానోత్ కిషన్ నాయక్ మద్దతు తెలిపారు. అనంతరం గిరిజన సంఘం నేతలు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News