Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:09 PM

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి
March 30, 2026 05:15 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం కొంతమంది కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని, ఖమ్మంలో ఐటీడీఏను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, వైరా కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న గిరిజన భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.

జిల్లాలో భూసమస్యలు, ఉపాధి, విద్య సమస్యలను పరిష్కరించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

బోనకల్ మండలం రాయినూతల గ్రామంలో సాగు చేస్తున్న అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలని, ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆందోళనకు తెలంగాణ జాగృతి నాయకుడు బానోత్ కిషన్ నాయక్ మద్దతు తెలిపారు. అనంతరం గిరిజన సంఘం నేతలు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News