ఘనంగా మునిపంపులలో పాపన్న వర్ధంతి. బహుజన ఐక్యతకు పిలుపు
ఘనంగా మునిపంపులలో పాపన్న వర్ధంతి. బహుజన ఐక్యతకు పిలుపు
Editor Desk
రామన్నపేట, మండలంలోని మునిపంపుల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం పెద్దలు మాట్లాడుతూ మొఘల్ అరాచకాలు, నిజాం నవాబుల దౌర్జన్యాలను ఎదిరించి గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరేసిన మహావీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. అలాంటి మహానుభావుడి స్ఫూర్తితో బహుజనులు ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి దుర్గయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి తోలుపునూరి చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు కోనూరు అంజయ్య గౌడ్, కమిటీ సభ్యులు కుక్కడబు స్వామి గౌడ్, ఉయ్యాల మల్లయ్య గౌడ్, సద్దల సత్తయ్య గౌడ్, అశోక్ గౌడ్, కల్లూరు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కోనూరు సత్తయ్య, ముత్తయ్య, మామిళ్ల అశోక్, మామిళ్ల కుమార్, ఉయ్యాల నరసింహ, పులిపల నాగార్జున, మామిళ్ల నాగార్జున, కునూరు శేఖర్ గౌడ్, జితేందర్ గౌడ్, ఉప్పలయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, యువకులు వీరమల్ల గౌడ్, గణేష్ గౌడ్, సైదులు గౌడ్, మచ్చగిరి గౌడ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి