Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వెంకటేశం గౌడ్ బర్త్‌డే వేడుకలు చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 31, 2026 10:19 PM

ఘనంగా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటరమణకు వీడ్కోలు. కలెక్టర్

ఘనంగా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటరమణకు వీడ్కోలు. కలెక్టర్

ఘనంగా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటరమణకు వీడ్కోలు. కలెక్టర్
March 31, 2026 08:27 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటరమణ పదవీ విరమణ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వెంకటరమణ సేవలను అభినందించారు. ప్రణాళికల రూపకల్పనలో ఆయన చూపిన నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొన్నారు. జనగణన–2027కు సంబంధించి అధికారులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన పాత్ర విశేషమన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో మరువలేని సేవలు అందించారని కొనియాడారు. జనగణన కార్యక్రమంలో నిబద్ధతతో పనిచేసిన విధానాన్ని అభినందించారు.

టి.జి.ఓ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ సహచరులతో సమన్వయం పాటిస్తూ సేవలందించారని పేర్కొన్నారు.

పదవీ విరమణ పొందిన వెంకటరమణ తన అనుభవాలను పంచుకుంటూ సహచరుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర అధికారులు కలిసి మెమెంటో, శాలువాతో ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్వో జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News