ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
స్థానికం బృందం
భువనగిరి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో మూడు రోజుల పాటు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో సమాన హక్కులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 45 శాతం మహిళలు ఉద్యోగులుగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు అభద్రత భావాన్ని విడిచిపెట్టి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీజీవో యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షురాలు అంబిక, కార్యదర్శి చైతన్య, టీఎన్జీవో కార్యదర్శి ఖదీర్, ఖజాంచి శ్రీకాంత్, ట్రెసా అధ్యక్షుడు కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణతో పాటు పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి