ఘనంగా ఎన్.దాస్ జన్మదిన వేడుకలు
ఘనంగా ఎన్.దాస్ జన్మదిన వేడుకలు
RAPOLU LINGASWAMY
డిసిసి ఉపాధ్యక్షులు ఎన్.దాస్ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి సరస్వతీనగర్ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్.దాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో సరస్వతీనగర్ డివిజన్ అధ్యక్షురాలు ఎన్.దేవి, డీసీసీ జనరల్ సెక్రటరీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం.లక్ష్మణ్రావు, సీనియర్ నాయకుడు కిషన్ నాయక్, డీసీసీ జాయింట్ సెక్రటరీలు వడ్త్యా రమేష్, ఎన్.సరోజా, సంతోష్నగర్ డివిజన్ అధ్యక్షుడు ఘని భాయ్, తలాబ్ చెంచలం డివిజన్ అధ్యక్షుడు ఫిరోజ్ జానీ, రాము, అరవింద్, గూడేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్.దాస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పార్టీకి, ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల మధ్య ఉంటూ మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్.దాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి