Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:51 AM

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
April 20, 2026 07:33 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి, చంద్రబాబు పేరున అర్చనలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి భక్తులకు, కార్యకర్తలకు ప్రసాద వితరణ చేశారు.​ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుదేశం పార్టీని అజేయ శక్తిగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు."చంద్రబాబు నాయుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రాబోయే తరాల భవిష్యత్తును ముందుగానే ఊహించగలిగే గొప్ప విజనరీ. దేశ రాజకీయాల్లో ఆయనది నిర్ణయాత్మక పాత్ర. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం.

​చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు నల్ల పర్వతాలు యాదవ్, గుమ్మడి అంజిరెడ్డి, ఆరగొని అశోక్ గౌడ్, పాశం రఘుపతి, యాట వెంకటేశం, తడక కోటేష్, గోషిక పాండు, అశోక్ గౌడ్, గోవిందా చారి, కలమ్మ, ఆకుల శంకరయ్య, అంజిరెడ్డి, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, గుర్రం యాదగిరి, అంతటి కిష్టయ్య, తెలుగు యువత అధ్యక్షులు బోదుల గణేష్, సాయి, లక్కారం వెంకటేశం, సంజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News