Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 09:56 PM

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
April 20, 2026 07:33 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి, చంద్రబాబు పేరున అర్చనలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి భక్తులకు, కార్యకర్తలకు ప్రసాద వితరణ చేశారు.​ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుదేశం పార్టీని అజేయ శక్తిగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు."చంద్రబాబు నాయుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రాబోయే తరాల భవిష్యత్తును ముందుగానే ఊహించగలిగే గొప్ప విజనరీ. దేశ రాజకీయాల్లో ఆయనది నిర్ణయాత్మక పాత్ర. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం.

​చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు నల్ల పర్వతాలు యాదవ్, గుమ్మడి అంజిరెడ్డి, ఆరగొని అశోక్ గౌడ్, పాశం రఘుపతి, యాట వెంకటేశం, తడక కోటేష్, గోషిక పాండు, అశోక్ గౌడ్, గోవిందా చారి, కలమ్మ, ఆకుల శంకరయ్య, అంజిరెడ్డి, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, గుర్రం యాదగిరి, అంతటి కిష్టయ్య, తెలుగు యువత అధ్యక్షులు బోదుల గణేష్, సాయి, లక్కారం వెంకటేశం, సంజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News