ఘనంగా చింతల జన్మదిన వేడుకలు..
ఘనంగా చింతల జన్మదిన వేడుకలు..
Sthanikam District Staff Reporter
యాదాద్రి భువనగిరి: బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చింతల యువసేన మరియు వారి అభిమానుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అంతరం రాయగిరిలోని సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... వెంకటేశ్వర రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి వారి ఆశీస్సులతో భవిష్యత్తులో వారు ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించాలని తెలపడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో వలపు విజయ్,దండబోయిన బలరాజ్ యాదవ్,గాజుల నవీన్,పల్లెపాటి రవికుమార్, ఎలిమినేటి మహేంద్ర రెడ్డి,దోషపాటి హరీష్,కూదే శ్రీశైలం,మోతే మనోహర్,నాగారం నరేష్ మరియు చింతల యువసేన నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి