ఘనంగా శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి వేడుకలు
ఘనంగా శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి వేడుకలు
Editor Desk
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు,బ్రెడ్ పంపిణీ భువనగిరి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్వర్గీయ శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి సందర్భంగా నేడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్,ఖమ్మం కొత్తగూడెం జిల్లా సంవిధన్ అడ్వైజర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవే స్ చీస్తీ,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు డి.రాములు పాల్గొన్నారు.ముఖ్య నేతల ప్రసంగం - నిరుపమాన సేవలు: శ్రీకూర లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి,ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేశారని నేతలు కొనియాడారు. ఆదర్శప్రాయం భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్గా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గా ఆయన అందించిన సేవలు మరువలేనివని,ఆయన కృషి నేటి కాంగ్రెస్ యువతరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు.వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ సిటిజన్ శెట్టి బాలయ్య యాదవ్ పట్టీకారి సత్య నారాయణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడురి నరసింహ మాజీ కౌన్సిలర్లు కుక్కదువ్వు సోమయ్య,మాజీ చైర్మన్ పోతాం శెట్టి వెంకటేష్,కైరం కొండ వెంకటేష్,సలావుద్దీన్,కూర శివ కుమార్,కూర సిద్దు రాజషేకర్ షాది ఖానా చైర్మన్ ఎజాస్ బీసీ సంఘం నర్సింహా ఎండీ అఖిల్ డాకూరి ప్రకాష్ సిహెచ్ విశ్వేశ్వర రావు, ఎండీ హమీద్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని శ్రీకూర లక్ష్మయ్య కి ఘనంగా నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి