Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:52 PM

గీత కార్మికుల బకాయిలు విడుదల చేయాలి తీన్మార్ మల్లన్నకు సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వినతి

గీత కార్మికుల బకాయిలు విడుదల చేయాలి తీన్మార్ మల్లన్నకు సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వినతి

గీత కార్మికుల బకాయిలు విడుదల చేయాలి తీన్మార్ మల్లన్నకు సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వినతి
06-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలో కళ్లుగీత కార్మికులు చెట్లపై నుంచి కిందపడి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అందించాల్సిన పరిహారం, బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అధ్యక్షుడు పరిటాల రవి కోరారు. ఈ అంశాన్ని శాసనమండలిలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి వినతి పత్రం అందజేశారు.

పెండింగ్‌లో బకాయిలు

గీత కార్మికులు ప్రాణాలకు తెగించి చెట్లపైకి ఎక్కి జీవనోపాధి పొందుతున్నప్పటికీ, ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రావాల్సిన పరిహారం, ఇతర బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని సంఘం నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లాలని కోరారు.

సేఫ్టీ పరికరాలు ఇవ్వాలి

గీత కార్మికుల ప్రాణ భద్రత కోసం అవసరమైన సేఫ్టీ పరికరాలు ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మండలిలో ప్రస్తావించాలి

ఈ నెల 16న జరగనున్న శాసనమండలి సమావేశాల్లో గీత కార్మికుల సమస్యలను ప్రస్తావించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మల్లన్నను కోరినట్లు తెలిపారు.

Sthanikam

గీత కార్మికుల బకాయిలు విడుదల చేయాలి తీన్మార్ మల్లన్నకు సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వినతి

Article Image

రాష్ట్రంలో కళ్లుగీత కార్మికులు చెట్లపై నుంచి కిందపడి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అందించాల్సిన పరిహారం, బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అధ్యక్షుడు పరిటాల రవి కోరారు. ఈ అంశాన్ని శాసనమండలిలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి వినతి పత్రం అందజేశారు.

పెండింగ్‌లో బకాయిలు

గీత కార్మికులు ప్రాణాలకు తెగించి చెట్లపైకి ఎక్కి జీవనోపాధి పొందుతున్నప్పటికీ, ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రావాల్సిన పరిహారం, ఇతర బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని సంఘం నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లాలని కోరారు.

సేఫ్టీ పరికరాలు ఇవ్వాలి

గీత కార్మికుల ప్రాణ భద్రత కోసం అవసరమైన సేఫ్టీ పరికరాలు ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మండలిలో ప్రస్తావించాలి

ఈ నెల 16న జరగనున్న శాసనమండలి సమావేశాల్లో గీత కార్మికుల సమస్యలను ప్రస్తావించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మల్లన్నను కోరినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News