గీత కార్మికుల బకాయిలు విడుదల చేయాలి తీన్మార్ మల్లన్నకు సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వినతి
గీత కార్మికుల బకాయిలు విడుదల చేయాలి తీన్మార్ మల్లన్నకు సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వినతి
స్థానికం బృందం
రాష్ట్రంలో కళ్లుగీత కార్మికులు చెట్లపై నుంచి కిందపడి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అందించాల్సిన పరిహారం, బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అధ్యక్షుడు పరిటాల రవి కోరారు. ఈ అంశాన్ని శాసనమండలిలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి వినతి పత్రం అందజేశారు.
పెండింగ్లో బకాయిలు
గీత కార్మికులు ప్రాణాలకు తెగించి చెట్లపైకి ఎక్కి జీవనోపాధి పొందుతున్నప్పటికీ, ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రావాల్సిన పరిహారం, ఇతర బకాయిలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని సంఘం నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లాలని కోరారు.
సేఫ్టీ పరికరాలు ఇవ్వాలి
గీత కార్మికుల ప్రాణ భద్రత కోసం అవసరమైన సేఫ్టీ పరికరాలు ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మండలిలో ప్రస్తావించాలి
ఈ నెల 16న జరగనున్న శాసనమండలి సమావేశాల్లో గీత కార్మికుల సమస్యలను ప్రస్తావించి, పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మల్లన్నను కోరినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి