Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:00 AM

గ్యాస్ సరఫరాపై అపోహలు తొలగింపు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

గ్యాస్ సరఫరాపై అపోహలు తొలగింపు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

గ్యాస్ సరఫరాపై అపోహలు తొలగింపు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
March 15, 2026 05:51 AM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్,

గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఎలాంటి కొరత లేదని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి స్పష్టం చేశారు. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పెట్రో ఉత్పత్తుల రవాణాపై ప్రభావం ఉన్నా, దేశంలో అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.

జిల్లాలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంధన సరఫరా మానిటరింగ్ కమిటీ పనిచేస్తోందని, గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేయడం, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అడ్డుకోవడం, నిల్వలపై నిఘా పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

గ్యాస్ సిలిండర్లను అక్రమంగా విక్రయించే ఏజెన్సీలపై జీవో–5, బీఎన్‌ఎస్ 6ఏ, 7, 1955 చట్టాల ప్రకారం భారీ జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాలని, బుకింగ్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎస్వో వనజతరెడ్డి, డీఎంహెచ్‌వో లలితాదేవి, డీటీసీ సదానందం, ఎమ్మార్వో వేణుగోపాల్ తదితర అధికారులు, గ్యాస్ డీలర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News