Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:17 PM

గ్యాస్ సరఫరాపై అపోహలు తొలగింపు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

గ్యాస్ సరఫరాపై అపోహలు తొలగింపు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

గ్యాస్ సరఫరాపై అపోహలు తొలగింపు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
March 15, 2026 05:51 AM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్,

గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఎలాంటి కొరత లేదని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి స్పష్టం చేశారు. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పెట్రో ఉత్పత్తుల రవాణాపై ప్రభావం ఉన్నా, దేశంలో అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.

జిల్లాలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంధన సరఫరా మానిటరింగ్ కమిటీ పనిచేస్తోందని, గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేయడం, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అడ్డుకోవడం, నిల్వలపై నిఘా పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

గ్యాస్ సిలిండర్లను అక్రమంగా విక్రయించే ఏజెన్సీలపై జీవో–5, బీఎన్‌ఎస్ 6ఏ, 7, 1955 చట్టాల ప్రకారం భారీ జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాలని, బుకింగ్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎస్వో వనజతరెడ్డి, డీఎంహెచ్‌వో లలితాదేవి, డీటీసీ సదానందం, ఎమ్మార్వో వేణుగోపాల్ తదితర అధికారులు, గ్యాస్ డీలర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News