PRINT TIME: March 04, 2026 08:31 PM
గాయపడిన నాయకుడిని పరామర్శించిన గాదరి కిషోర్ కుమార్
గాయపడిన నాయకుడిని పరామర్శించిన గాదరి కిషోర్ కుమార్
March 04, 2026 07:09 PM
6 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి: తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక కిశోర్ ప్రమాదవశాత్తూ కాలుకు గాయపడిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్ రావుతో కలిసి గ్రామానికి చేరుకుని పరామర్శించారు. గాయంపై వివరాలు అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం పొందాలని సూచించారు.
అదేవిధంగా అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జటంగి మల్లయ్య తండ్రి పాపయ్య ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య, జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి