Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 01:39 PM

గాయపడిన నాయకుడిని పరామర్శించిన గాదరి కిషోర్ కుమార్

గాయపడిన నాయకుడిని పరామర్శించిన గాదరి కిషోర్ కుమార్

గాయపడిన నాయకుడిని పరామర్శించిన గాదరి కిషోర్ కుమార్
March 04, 2026 07:09 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక కిశోర్ ప్రమాదవశాత్తూ కాలుకు గాయపడిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్ రావుతో కలిసి గ్రామానికి చేరుకుని పరామర్శించారు. గాయంపై వివరాలు అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం పొందాలని సూచించారు.

అదేవిధంగా అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జటంగి మల్లయ్య తండ్రి పాపయ్య ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య, జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News