Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజా ఉద్యమాలకు పాటే ప్రాణం: మాగి వెంకన్న రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 07:39 PM

గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ… భువనగిరిలో ఆర్‌సెటి ప్రారంభం. కలెక్టర్

గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ… భువనగిరిలో ఆర్‌సెటి ప్రారంభం. కలెక్టర్

గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ… భువనగిరిలో ఆర్‌సెటి ప్రారంభం. కలెక్టర్
March 30, 2026 05:47 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌సెటి) శిక్షణా కేంద్రాన్ని సోమవారం భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువత, మహిళలు శిక్షణా అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆర్‌సెటి ద్వారా అందిస్తున్న నైపుణ్య శిక్షణలతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, శిక్షణ అనంతరం స్వయం ఉపాధి ప్రారంభించేందుకు బ్యాంకుల నుంచి సహకారం అందుతుందని తెలిపారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి మాట్లాడుతూ సెల్‌ఫోన్ సర్వీసింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్ హోమ్ వైరింగ్, ప్లంబింగ్, టైలరింగ్, డ్రెస్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వంటి కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌సెటి డైరెక్టర్ కిషన్ భుక్య, డివిజనల్ మేనేజర్ పంకజ్, ఎల్‌డీఎం మాటూరి వంశీ, డీపీఎం శ్రీనివాస్, జేడీఎం రాజు, బ్యాంకు ప్రతినిధులు, శిక్షణార్థులు పాల్గొన్నారు..


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News