Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయితో ఐదుగురు అరెస్ట్ భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 10:30 PM

గ్రామీణ పరిశ్రమలపై విద్యార్థులకు అవగాహన

గ్రామీణ పరిశ్రమలపై విద్యార్థులకు అవగాహన

గ్రామీణ పరిశ్రమలపై విద్యార్థులకు అవగాహన
April 01, 2026 08:34 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీకాం, బీబీఏ (రిటైల్ ఆపరేషన్స్) తృతీయ సంవత్సరం విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థతో పాటు భూదాన్ పోచంపల్లి చేనేత పరిశ్రమను సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్షిప్ నైపుణ్యాలు, పరిశ్రమలపై అవగాహన పెంపొందించేందుకు ఈ పర్యటన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కామర్స్ విభాగాధిపతి డాక్టర్ పి. రమాదేవి మాట్లాడుతూ అకాడమిక్ విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడమే లక్ష్యమన్నారు.

స్వామి రామానంద తీర్థ గ్రామీణ శిక్షణ సంస్థలో డాక్టర్ కిషోర్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఎన్. విహారి కృష్ణ విద్యార్థులకు వివిధ కోర్సులు, ఉపాధి అవకాశాలు, శిక్షణ, హాస్టల్, ప్లేస్‌మెంట్ సౌకర్యాలపై వివరించారు. శిక్షణ నిపుణులు వసంత రాణి కూడా కోర్సులపై అవగాహన కల్పించారు.

అలాగే కళాశాల–సంస్థ మధ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవాలన్న ఆసక్తిని ఇరువర్గాలు వ్యక్తం చేశాయి.

అనంతరం విద్యార్థులు భూదాన్ పోచంపల్లి చేనేత పరిశ్రమను సందర్శించి ఇక్కత్ వస్త్రాల తయారీ, మగ్గాలపై నేసే విధానం, మార్కెటింగ్ ప్రక్రియలను ప్రత్యక్షంగా చేనేత కారుల ద్వారా తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు, డాక్టర్ పి. రమాదేవి, డాక్టర్ ఎస్. సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఎస్. శారద, ఎన్. బాల, మరియదాస్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News