Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 15, 2026 11:10 PM

గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయి.

గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయి.

గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయి.
May 29, 2026 08:44 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ద్రోహదపడతాయని డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో యలమర్తి అంబేద్కర్( కానిస్టేబుల్) ఆధ్వర్యంలో టిపిఎల్ లీగ్ క్రికెట్ సీజన్ 2 టోర్నమెంట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పి శ్రీనివాసరెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి యువతి, యువకులు క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ, రకరకాల క్రీడల్లో పాల్గొంటూ భవిష్యత్తులో జాతీయస్థాయిలో గుర్తింపు పొందుటకు ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని ఈ గ్రామానికి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని అన్నారు. క్రీడలతోపాటు కష్టం అనుకోకుండా ఇష్టంతో చదివి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలుసంపాదించి కన్న తల్లిదండ్రులకు చదువు నేర్పిన గురువులకు జన్మనిచ్చిన గ్రామానికి

ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచి అమరబోయిన ఉమామహేశ్వరి శ్రీనివాస్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పులి సులోచన రావు, 8వ వార్డు నెంబర్ కొండపల్లి నాగమ్మ లచ్చయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యలమర్తి రాము, కొండపల్లి ఆంజనేయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు యలమర్తి శౌరి, బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు బాలేబోయిన వేలాద్రి, బాలే బోయిన వెంకన్న, కత్తుల భగత్, మాజీ వార్డ్ నెంబర్ కనకరత్నం ఆదాం, తొగర్రాయి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి బిక్షం, క్రికెట్ టీం కెప్టెన్ మంద నరసింహారావు, చుక్క పుల్లారావు, అమరబోయిన శ్రీహరి, శీలం నవీన్, దాసరి నాగేంద్రబాబు, క్రికెట్ టీం సభ్యులు, క్రీడాభిమానులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News