సోమందేపల్లి: మండలంలోని ప్రతి పంచాయతీలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల అభివృద్ధికి ఇది కీలకమని ఎంపీడీఓ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో 16 పంచాయతీల కార్యదర్శులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ప్రతి పంచాయతీని సమస్యలేని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంపీడీఓ కార్యదర్శులకు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి