PRINT TIME: April 20, 2026 10:46 PM
గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు
గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు
April 20, 2026 08:29 PM
41 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో “స్థానికం” దినపత్రికకు విశేష ఆదరణ లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా పత్రిక చేరడంతో స్థానిక వార్తలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది.
గ్రామానికి చెందిన కొండ శేఖర్ గౌడ్ బయట కూర్చొని పత్రికను ఆసక్తిగా చదువుతూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పత్రికలో ప్రచురితమవుతున్న ప్రాంతీయ వార్తలు, సమస్యలు, అభివృద్ధి అంశాలు ప్రజలకు దగ్గరగా ఉండటంతో గ్రామస్థులు దినపత్రికను ఆదరిస్తున్నారని స్థానికులు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో సమాచార విస్తరణకు “స్థానికం” దినపత్రిక వేదికగా మారుతూ, ప్రజలకు ఉపయోగకరమైన వార్తలను అందిస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి