గ్రామాల పరిశుభ్రతకు అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
గ్రామాల పరిశుభ్రతకు అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
స్థానికం బృందం
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ భాగస్వాములై గ్రామాల పరిశుభ్రతకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.
శుక్రవారం బొమ్మలరామారం మండలం నాగినేపల్లి గ్రామంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలో చేపట్టిన పరిశుభ్రత పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలను గ్రామంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కాలనీలో చెత్త లేకుండా శుభ్రం చేయాలని, మురికి కాలువలు మరియు రోడ్ల ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
పరిశుభ్రమైన త్రాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలని, వాటర్ ట్యాంకులను ప్రతి నెల శుభ్రం చేయాలని సూచించారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మార్చి నెల చివరి నెల కావడంతో ఇంటి పన్నుల వసూళ్లను పూర్తి చేసి క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రాములు, ఎంపీడీవో, సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి