గ్రామ ప్రజల ఆరోగ్యానికి కొత్త అడుగు… సర్పంచ్ విక్రమ్ చేతుల మీదుగా మెడికల్ షాప్ ప్రారంభం
గ్రామ ప్రజల ఆరోగ్యానికి కొత్త అడుగు… సర్పంచ్ విక్రమ్ చేతుల మీదుగా మెడికల్ షాప్ ప్రారంభం
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అజయ్ ఫస్ట్ ఎయిడ్ & మెడికల్ షాప్ను సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఘనంగా ప్రారంభించారు. కొంగరి రాజలింగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని, ఈ మెడికల్ షాప్ ద్వారా ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందుతాయని అన్నారు. గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్ పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మందడి విద్యాసాగర్ రెడ్డి, గర్ధాస్ వినయ్, మంటి లింగస్వామి, మీర్ ఖాజా అలీ, చిన్నపాక శ్రీనివాస్, రాస వెంకటేష్, సింగణబోయిన సత్యనారాయణ, సింగణబోయిన జంగయ్య, గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, మంటి బిక్షపతి, బొల్ల నాగరాజు, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ మధు, నీరుడు వెంకటేష్, నీరుడు నరేష్, కాటపల్లి నరేష్, కాటపల్లి మహేష్, పగుడాల నరేందర్, కొంగరి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి