Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:46 PM

గర్భకోశ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు ప్రారంభం

గర్భకోశ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు ప్రారంభం

గర్భకోశ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు ప్రారంభం
06-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: గర్భకోశ క్యాన్సర్ నివారణ కోసం 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ (Human Papilloma Virus) టీకాల కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రారంభిస్తున్నట్లు రామన్నపేట సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ అశ్వినికుమార్ తెలిపారు. ఆదివారం సీహెచ్‌సీ రామన్నపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నెలరోజుల పాటు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో కూడా టీకాలు అందించనున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా హెచ్‌ఈఓ గోపాల్ గర్ల్స్ హైస్కూల్‌లో విద్యార్థినులకు గర్భకోశ క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అర్హులైన బాలికలందరూ హెచ్‌పీవీ టీకా తీసుకోవాలని సూచించారు.

అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా సాధారణ స్థితిలో ఉండేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన టోల్ ఫ్రీ నంబర్ 14416కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.


Sthanikam

గర్భకోశ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు ప్రారంభం

Article Image

రామన్నపేట: గర్భకోశ క్యాన్సర్ నివారణ కోసం 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ (Human Papilloma Virus) టీకాల కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రారంభిస్తున్నట్లు రామన్నపేట సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ అశ్వినికుమార్ తెలిపారు. ఆదివారం సీహెచ్‌సీ రామన్నపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నెలరోజుల పాటు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో కూడా టీకాలు అందించనున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా హెచ్‌ఈఓ గోపాల్ గర్ల్స్ హైస్కూల్‌లో విద్యార్థినులకు గర్భకోశ క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అర్హులైన బాలికలందరూ హెచ్‌పీవీ టీకా తీసుకోవాలని సూచించారు.

అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా సాధారణ స్థితిలో ఉండేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన టోల్ ఫ్రీ నంబర్ 14416కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News