గర్భకోశ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకాలు ప్రారంభం
గర్భకోశ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకాలు ప్రారంభం
స్థానికం బృందం
రామన్నపేట: గర్భకోశ క్యాన్సర్ నివారణ కోసం 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ (Human Papilloma Virus) టీకాల కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రారంభిస్తున్నట్లు రామన్నపేట సీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ అశ్వినికుమార్ తెలిపారు. ఆదివారం సీహెచ్సీ రామన్నపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నెలరోజుల పాటు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పీహెచ్సీలు, యూపీహెచ్సీలలో కూడా టీకాలు అందించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా హెచ్ఈఓ గోపాల్ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినులకు గర్భకోశ క్యాన్సర్పై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అర్హులైన బాలికలందరూ హెచ్పీవీ టీకా తీసుకోవాలని సూచించారు.
అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా సాధారణ స్థితిలో ఉండేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన టోల్ ఫ్రీ నంబర్ 14416కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి