Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:09 AM

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో
03-03-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని స్వర్ణ గ్రామ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విఆర్వో చలమారెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ప్రాపర్టీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన మాధవరెడ్డి వద్ద నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన మాధవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ను ఆశ్రయించాడు.

ఈ మేరకు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చు వేశారు. గుడ్లూరు బస్టాండ్ సెంటర్‌లోని ఓ షాపులో నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి విఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Sthanikam

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో

Article Image

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని స్వర్ణ గ్రామ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విఆర్వో చలమారెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ప్రాపర్టీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన మాధవరెడ్డి వద్ద నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన మాధవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ను ఆశ్రయించాడు.

ఈ మేరకు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చు వేశారు. గుడ్లూరు బస్టాండ్ సెంటర్‌లోని ఓ షాపులో నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి విఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News