Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 04:37 PM

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో
March 03, 2026 08:26 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని స్వర్ణ గ్రామ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విఆర్వో చలమారెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ప్రాపర్టీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన మాధవరెడ్డి వద్ద నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన మాధవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ను ఆశ్రయించాడు.

ఈ మేరకు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చు వేశారు. గుడ్లూరు బస్టాండ్ సెంటర్‌లోని ఓ షాపులో నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి విఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News