PRINT TIME: March 03, 2026 10:13 PM
ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో
ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో
March 03, 2026 08:26 PM
13 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని స్వర్ణ గ్రామ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విఆర్వో చలమారెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ప్రాపర్టీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన మాధవరెడ్డి వద్ద నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన మాధవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ను ఆశ్రయించాడు.
ఈ మేరకు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చు వేశారు. గుడ్లూరు బస్టాండ్ సెంటర్లోని ఓ షాపులో నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి విఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి