Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:19 AM

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు
April 02, 2026 07:02 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అధ్యక్షతన గురువారం బ్యాంక్ కంట్రోలర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26లో భాగంగా బ్యాంకుల ద్వారా అమలు చేయనున్న జిల్లా లక్ష్యాలకు ఆమోదం లభించింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారికి బ్యాంకుల నుంచి కాన్సెంట్ ఇవ్వడం తప్పనిసరి అని తెలిపారు. ఈ పథకాల అమలులో భాగంగా ఈవీ టూ వీలర్ యూనిట్లకు 10 శాతం, ఈవీ త్రీ వీలర్ యూనిట్లు మరియు పాడి గేదెల పథకాలకు 30 శాతం బ్యాంకు లోన్ మంజూరు చేయాల్సి ఉంటుందని వివరించారు.

దరఖాస్తుల గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. మండలాలు, పథకాల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా కాన్సెంట్ ఇవ్వడానికి బ్యాంక్ కంట్రోలర్లు అంగీకారం తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యాంసుందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఇంచార్జ్) వంశీతో పాటు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర బ్యాంకుల కంట్రోలర్లు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News