ఎస్సీ యాక్షన్ ప్లాన్కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు
ఎస్సీ యాక్షన్ ప్లాన్కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అధ్యక్షతన గురువారం బ్యాంక్ కంట్రోలర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26లో భాగంగా బ్యాంకుల ద్వారా అమలు చేయనున్న జిల్లా లక్ష్యాలకు ఆమోదం లభించింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారికి బ్యాంకుల నుంచి కాన్సెంట్ ఇవ్వడం తప్పనిసరి అని తెలిపారు. ఈ పథకాల అమలులో భాగంగా ఈవీ టూ వీలర్ యూనిట్లకు 10 శాతం, ఈవీ త్రీ వీలర్ యూనిట్లు మరియు పాడి గేదెల పథకాలకు 30 శాతం బ్యాంకు లోన్ మంజూరు చేయాల్సి ఉంటుందని వివరించారు.
దరఖాస్తుల గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. మండలాలు, పథకాల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా కాన్సెంట్ ఇవ్వడానికి బ్యాంక్ కంట్రోలర్లు అంగీకారం తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యాంసుందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఇంచార్జ్) వంశీతో పాటు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర బ్యాంకుల కంట్రోలర్లు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి