Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అనాజిపురంలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వైభవం భక్తులతో కిక్కిరిసిన ఆలయం AAP యువ ముఖానికి ‘రాజ్యసభ ఎగ్జిట్’… అంతర్గత వ్యూహాల్లో భారీ మార్పులా? “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 08:59 PM

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు
April 02, 2026 07:02 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అధ్యక్షతన గురువారం బ్యాంక్ కంట్రోలర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26లో భాగంగా బ్యాంకుల ద్వారా అమలు చేయనున్న జిల్లా లక్ష్యాలకు ఆమోదం లభించింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారికి బ్యాంకుల నుంచి కాన్సెంట్ ఇవ్వడం తప్పనిసరి అని తెలిపారు. ఈ పథకాల అమలులో భాగంగా ఈవీ టూ వీలర్ యూనిట్లకు 10 శాతం, ఈవీ త్రీ వీలర్ యూనిట్లు మరియు పాడి గేదెల పథకాలకు 30 శాతం బ్యాంకు లోన్ మంజూరు చేయాల్సి ఉంటుందని వివరించారు.

దరఖాస్తుల గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. మండలాలు, పథకాల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా కాన్సెంట్ ఇవ్వడానికి బ్యాంక్ కంట్రోలర్లు అంగీకారం తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యాంసుందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఇంచార్జ్) వంశీతో పాటు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర బ్యాంకుల కంట్రోలర్లు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News