190 యూనిట్లకు రూ.3.82 కోట్లు – ఈవీ వాహనాలు, వ్యవసాయ పరికరాలకు ఆర్థిక సహాయం
యాదాద్రి భువనగిరి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి కోసం 2025–26 సంవత్సరానికి ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు జిల్లా పరిపాలన వెల్లడించింది. ఈ పథకం కింద 190 యూనిట్లకు రూ.3.82 కోట్లతో 190 కుటుంబాలకు బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించారు.
పథకం కింద విద్యుత్ ద్విచక్ర వాహనాలు 118 యూనిట్లు, విద్యుత్ మూడు చక్రాల వాహనాలు 60 యూనిట్లు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ మరియు వ్యవసాయ సంబంధిత పరికరాలు 12 యూనిట్లను అందించనున్నారు.
అర్హతగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. రవాణా ఆధారిత పథకాలకు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. సోలార్ పంప్ పథకానికి కనీసం రెండు ఎకరాల భూమి, బోరుబావిలో నీరు ఉండాలి.
దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ పుస్తకం, ఫోటో తదితర పత్రాలు సమర్పించాలి. ద్విచక్ర వాహనాల పథకంలో జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఉబర్ వంటి సంస్థల్లో డెలివరీ లేదా రవాణా సేవలు అందించే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మార్చి 17 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుదారులు OBMMS Portal ద్వారా నమోదు చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తును డౌన్లోడ్ చేసి సంబంధిత పత్రాలతో ఎంపీడీవో కార్యాలయం లేదా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి.
పథకానికి సంబంధించిన అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.దరఖాస్తు రిజిస్ట్రేషన్ కు చివరి తేది. 24.03.2026 : దరఖాస్తును https://tgobmms.cgg.gov.in ఆన్లైన్ తేది 17.03.2026 నుండి 24.03.2026 లోపల నమోదు చేసుకోనవలెను. OBMMS లో పూర్తి చేసిన దరఖాస్తును అర్జీదారుడు డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాలను జతచేసి ఎంపీడీవో కార్యాలయములో / పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయములో అందజేయవలెను.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి