Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:07 AM

ఎస్సీ కార్యాచరణ ప్రణాళికకు దరఖాస్తులు ఆహ్వానం

ఎస్సీ కార్యాచరణ ప్రణాళికకు దరఖాస్తులు ఆహ్వానం

ఎస్సీ కార్యాచరణ ప్రణాళికకు దరఖాస్తులు ఆహ్వానం
March 14, 2026 05:49 PM 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

190 యూనిట్లకు రూ.3.82 కోట్లు – ఈవీ వాహనాలు, వ్యవసాయ పరికరాలకు ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి కోసం 2025–26 సంవత్సరానికి ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు జిల్లా పరిపాలన వెల్లడించింది. ఈ పథకం కింద 190 యూనిట్లకు రూ.3.82 కోట్లతో 190 కుటుంబాలకు బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించారు.

పథకం కింద విద్యుత్ ద్విచక్ర వాహనాలు 118 యూనిట్లు, విద్యుత్ మూడు చక్రాల వాహనాలు 60 యూనిట్లు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ మరియు వ్యవసాయ సంబంధిత పరికరాలు 12 యూనిట్లను అందించనున్నారు.

అర్హతగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. రవాణా ఆధారిత పథకాలకు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. సోలార్ పంప్ పథకానికి కనీసం రెండు ఎకరాల భూమి, బోరుబావిలో నీరు ఉండాలి.

దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ పుస్తకం, ఫోటో తదితర పత్రాలు సమర్పించాలి. ద్విచక్ర వాహనాల పథకంలో జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఉబర్ వంటి సంస్థల్లో డెలివరీ లేదా రవాణా సేవలు అందించే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఈ పథకానికి ఆన్‌లైన్ ద్వారా మార్చి 17 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుదారులు OBMMS Portal ద్వారా నమోదు చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసి సంబంధిత పత్రాలతో ఎంపీడీవో కార్యాలయం లేదా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి.

పథకానికి సంబంధించిన అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.దరఖాస్తు రిజిస్ట్రేషన్ కు చివరి తేది. 24.03.2026 : దరఖాస్తును https://tgobmms.cgg.gov.in ఆన్లైన్ తేది 17.03.2026 నుండి 24.03.2026 లోపల నమోదు చేసుకోనవలెను. OBMMS లో పూర్తి చేసిన దరఖాస్తును అర్జీదారుడు డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాలను జతచేసి ఎంపీడీవో కార్యాలయములో / పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయములో అందజేయవలెను.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News