Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 10:05 PM

ఎస్కేడీ నగర్‌లో సీసీ రోడ్ల పనులు త్వరలో ప్రారంభం

ఎస్కేడీ నగర్‌లో సీసీ రోడ్ల పనులు త్వరలో ప్రారంభం

ఎస్కేడీ నగర్‌లో సీసీ రోడ్ల పనులు త్వరలో ప్రారంభం
March 16, 2026 06:22 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్ బీ నగర్ బీ .యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎస్కేడీ నగర్ కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.29 లక్షలు మంజూరైనప్పటికీ గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని కాలనీవాసులు జీహెచ్ఎంసీ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన మొద్దు లచ్చి రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ విభాగం డీఈ కనకయ్య, ఏఈ విఘ్నేశ్వరి లతో కలిసి కాలనీలో రోడ్డు పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్తేదారుల కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని కాలనీవాసులు తెలియజేయడంతో సంబంధిత అధికారులతో చర్చించామని, వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ సరైన లెవెల్స్‌తో పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు, కో కన్వీనర్ రఘురాం నేత, ట్రెజరర్ కృష్ణారావు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యదర్శి కాంతారావు, కార్యవర్గ సభ్యులు వెంకట్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, కాలనీ సభ్యులు వీరారెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News