‘ఎస్ఐఆర్’తో ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి: బి.వి. రాఘవులు
‘ఎస్ఐఆర్’తో ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి: బి.వి. రాఘవులు
K.RAVI
రాబోయే 2029 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)ను ప్రయోగిస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు ఆరోపించారు. సోమవారం చౌటుప్పల్లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను, ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, గిరిజనులు, పేద వర్గాల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ‘ఎస్ఐఆర్’ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గతంలో బెంగాల్, బీహార్, అస్సాంలలో అమలు చేసిన ఈ కుట్రను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. జిల్లాలో బీఎల్ఓలకు సరైన శిక్షణ ఇవ్వలేదని, కలెక్టర్ వెంటనే అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎం డి పాష అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య, కొండమడుగు నరసింహ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్ గౌడ్, కల్లూరి మల్లేశం, బూరుగు కృష్ణారెడ్డి, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసచారి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు రాయగిరి కిష్టయ్య, సిరిపంగి స్వామి, అవ్వారు రామేశ్వరి, బొడ్డుపల్లి వెంకటేష్, మద్దెల రాజయ్య, దూడ యాదిరెడ్డి, కోట రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి