Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:08 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి
13-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఎస్‌ఐఆర్ పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలని తెలిపారు. సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు నమోదు కాకుండా జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు.

రాజకీయ పార్టీల ద్వారా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని, బూత్ లెవల్ అధికారులందరికీ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే మరణించిన ఓటర్ల వివరాలు, పెండింగ్‌లో ఉన్న ఫార్ములు, జనాభా వివరాలు, నకిలీ ఓట్ల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించి సవరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ కృష్ణా తదితర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

Article Image

ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఎస్‌ఐఆర్ పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలని తెలిపారు. సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు నమోదు కాకుండా జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు.

రాజకీయ పార్టీల ద్వారా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని, బూత్ లెవల్ అధికారులందరికీ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే మరణించిన ఓటర్ల వివరాలు, పెండింగ్‌లో ఉన్న ఫార్ములు, జనాభా వివరాలు, నకిలీ ఓట్ల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించి సవరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ కృష్ణా తదితర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News