ఎస్ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి
ఎస్ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి
స్థానికం బృందం
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఎస్ఐఆర్ పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలని తెలిపారు. సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు నమోదు కాకుండా జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు.
రాజకీయ పార్టీల ద్వారా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని, బూత్ లెవల్ అధికారులందరికీ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే మరణించిన ఓటర్ల వివరాలు, పెండింగ్లో ఉన్న ఫార్ములు, జనాభా వివరాలు, నకిలీ ఓట్ల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించి సవరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ కృష్ణా తదితర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి