Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:12 AM

ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు

ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు

ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు
14-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు శనివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

పట్టణంలోని గంజ్ హై స్కూల్‌, ప్రభుత్వ బాలుర పాఠశాల, విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మెడికల్ సిబ్బంది తదితర అంశాలను కూడా పరిశీలించారు.

పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ఈ పరిశీలనలో పరీక్షా కేంద్రాల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు

Article Image

భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు శనివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

పట్టణంలోని గంజ్ హై స్కూల్‌, ప్రభుత్వ బాలుర పాఠశాల, విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మెడికల్ సిబ్బంది తదితర అంశాలను కూడా పరిశీలించారు.

పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ఈ పరిశీలనలో పరీక్షా కేంద్రాల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News