Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:44 AM

ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు

ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు

ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు
March 14, 2026 05:26 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌సి పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు శనివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

పట్టణంలోని గంజ్ హై స్కూల్‌, ప్రభుత్వ బాలుర పాఠశాల, విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మెడికల్ సిబ్బంది తదితర అంశాలను కూడా పరిశీలించారు.

పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ఈ పరిశీలనలో పరీక్షా కేంద్రాల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News