ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు
ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీ అదనపు కలెక్టర్ భాస్కరరావు
Editor Desk
భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు శనివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
పట్టణంలోని గంజ్ హై స్కూల్, ప్రభుత్వ బాలుర పాఠశాల, విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మెడికల్ సిబ్బంది తదితర అంశాలను కూడా పరిశీలించారు.
పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ఈ పరిశీలనలో పరీక్షా కేంద్రాల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి