ఏపూరి గ్రామంలో వడ్ల మార్కెట్ ప్రారంభం
ఏపూరి గ్రామంలో వడ్ల మార్కెట్ ప్రారంభం
Komidala Mahender reddy
చిట్యాల మండలం గుండ్రంపల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏపూరి గ్రామంలో వడ్ల మార్కెట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి హాజరై మార్కెట్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తమ పంటలకు సరైన ధర లభించేలా మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం కల్పించడం ఈ మార్కెట్ ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకన్న, మార్కెట్ డైరెక్టర్ యాదగిరి, ఏపూరి గ్రామ శాఖ అధ్యక్షుడు పాలెం కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ సురిగి లింగస్వామి, మాజీ సర్పంచ్ గడకారు సైదులు, కార్యదర్శి బండ శేఖర్ పాల్గొన్నారు.అలాగే రైతులు గుమ్మి వెంగల్రెడ్డి, టేకుల నర్సిరెడ్డి, కొండే వెంకటేశు, కొండే లింగస్వామి, బండ మచ్చ గిరి, బియ్యపు వెంకటేశం, వలిగొండ నరసింహ, గ్రామ సెక్రటరీ మల్లేష్, మందుల కిష్టయ్య, గోపగోని మల్లయ్య, బండ కిష్టయ్య, మందుల వెంకటేష్, బచ్చగొని నరసింహ, పంతంగి గణేష్, దేవరపల్లి శీను రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి