Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 09:27 PM

ఏప్రిల్ 1 నుంచి ‘ఈ-ఆఫీస్’ ద్వారానే ఫైళ్ల నిర్వహణ..కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం

ఏప్రిల్ 1 నుంచి ‘ఈ-ఆఫీస్’ ద్వారానే ఫైళ్ల నిర్వహణ..కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం

ఏప్రిల్ 1 నుంచి ‘ఈ-ఆఫీస్’ ద్వారానే ఫైళ్ల నిర్వహణ..కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం
March 30, 2026 07:25 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభల నిర్వహణ..

పదో తరగతి విద్యార్థులు చదువు ఆపొద్దు బాల్య వివాహాల నిరోధానికి చర్యలు..


​నల్గొండ : జిల్లాలో ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ప్రభుత్వ ఫైళ్ల నిర్వహణ అంతా ‘ఈ-ఆఫీస్’ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..



ఈ-ఆఫీస్ నిర్వహణపై ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామని బుధవారం నుండి మాన్యువల్ ఫైళ్లకు స్వస్తి పలికి డిజిటల్ విధానంలోనే ఫైళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన జిల్లావ్యాప్తంగా ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామసభలు మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను ఈ సభల్లో చదివి వినిపించాలి. ప్రజలకు అర్థమయ్యేలా ఫొటోలు, వీడియోలతో ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు మినిట్స్‌ను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరు గ్యారంటీలు, ధరణి (తిరుమలగిరి సాగర్), భూభారతి (దేవరకొండ), సోలార్ రూఫ్ టాప్ (కనగల్) పథకాల లబ్ధిదారుల వివరాలను నియోజకవర్గాల వారీగా నివేదికలు రూపొందించి సిపిఓకు సమర్పించాలని ఆదేశించారు.


​ముఖ్యమైన పనుల దృష్ట్యా సెలవులు రద్దు..


రానున్న రెండున్నర నెలలు జిల్లా యంత్రాంగానికి అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. రబీ ధాన్యం కొనుగోలు, జనగణన, ప్రజా పాలన వంటి ముఖ్యమైన విధులు ఉన్నందున అత్యవసరమైతే తప్ప అధికారులకు, సిబ్బందికి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఎండాకాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


​చదువు మధ్యలో ఆపొద్దు..



పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీగా ఉండకూడదని వారిని ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేర్పించేలా మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను చదువు మాన్పించి బాల్య వివాహాల వైపు మళ్లించకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 2025-26 రబీ ధాన్యం కొనుగోలుపై రూపొందించిన గోడపత్రికను అలాగే జిల్లా ముస్లిం ఉద్యోగుల టేబుల్ క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ సీనియర్ చెవిటి క్రీడల ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 126 దరఖాస్తులు అందాయి. ఇందులో రెవెన్యూ విభాగానికి సంబంధించి 69, ఇతర శాఖలకు 57 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఆర్డీఓలు శ్రీదేవి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News