టాలెంట్ టెస్ట్లో టాపర్గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి
టాలెంట్ టెస్ట్లో టాపర్గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి
K.RAVI
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో బొమ్సిరెడ్డి హర్షిత రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచి టాపర్గా నిలిచింది.2022-23 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్కు నిర్వహించిన ఈ పరీక్షను రిలయన్స్ సంస్థ, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టెస్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హర్షిత రెడ్డి కి రిలయన్స్ సంస్థ నుంచి రూ.2,00,000, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థ నుంచి రూ.2,00,000 మొత్తంగా రూ.4,00,000 ప్రోత్సాహక నగదు బహుమతిగా అందజేశారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించిన రిలయన్స్, ఎఫ్ ఎఫ్ ఈ సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి మరింత సహాయం అందించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి