Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:40 PM

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన
30-03-2026 215 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : దళిత బంధు పథకం కింద మంజూరైన నిధులను తక్షణమే విడుదల చేయాలని మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండో విడతలో భాగంగా 254 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షలు జమ చేసినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా నిధులు నిలిచిపోయాయని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా పలుమార్లు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత బంధు లబ్ధిదారులుగా నమోదు కావడంతో ఇతర సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ తుంగతుర్తి నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు.

పేదరికంలో జీవిస్తున్న తమకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేసి మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బాలెంల నరేందర్, ఇటుకాల ఆంజనేయులు, జిల్లా శివాజీ, జక్కుల గిరిబాబు, చెడిపల్లి రఘుపతి, అల్వాల శంకర్, బందెల శీను, ఇరుగు లక్ష్మణ్, నీలం నరేష్, ఎలిజాల అశోక్, బోనాల మహేందర్, చెరుకు మధు, సందీప్, కడియం నాగయ్య, బట్ట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన

Article Image

యాదాద్రి భువనగిరి, : దళిత బంధు పథకం కింద మంజూరైన నిధులను తక్షణమే విడుదల చేయాలని మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండో విడతలో భాగంగా 254 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షలు జమ చేసినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా నిధులు నిలిచిపోయాయని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా పలుమార్లు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత బంధు లబ్ధిదారులుగా నమోదు కావడంతో ఇతర సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ తుంగతుర్తి నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు.

పేదరికంలో జీవిస్తున్న తమకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేసి మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బాలెంల నరేందర్, ఇటుకాల ఆంజనేయులు, జిల్లా శివాజీ, జక్కుల గిరిబాబు, చెడిపల్లి రఘుపతి, అల్వాల శంకర్, బందెల శీను, ఇరుగు లక్ష్మణ్, నీలం నరేష్, ఎలిజాల అశోక్, బోనాల మహేందర్, చెరుకు మధు, సందీప్, కడియం నాగయ్య, బట్ట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News