Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:09 AM

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన
March 30, 2026 06:37 PM 206 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : దళిత బంధు పథకం కింద మంజూరైన నిధులను తక్షణమే విడుదల చేయాలని మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండో విడతలో భాగంగా 254 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షలు జమ చేసినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా నిధులు నిలిచిపోయాయని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా పలుమార్లు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత బంధు లబ్ధిదారులుగా నమోదు కావడంతో ఇతర సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ తుంగతుర్తి నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు.

పేదరికంలో జీవిస్తున్న తమకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేసి మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బాలెంల నరేందర్, ఇటుకాల ఆంజనేయులు, జిల్లా శివాజీ, జక్కుల గిరిబాబు, చెడిపల్లి రఘుపతి, అల్వాల శంకర్, బందెల శీను, ఇరుగు లక్ష్మణ్, నీలం నరేష్, ఎలిజాల అశోక్, బోనాల మహేందర్, చెరుకు మధు, సందీప్, కడియం నాగయ్య, బట్ట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News