Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 08:48 PM

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన

దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన
March 30, 2026 06:37 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : దళిత బంధు పథకం కింద మంజూరైన నిధులను తక్షణమే విడుదల చేయాలని మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండో విడతలో భాగంగా 254 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షలు జమ చేసినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా నిధులు నిలిచిపోయాయని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా పలుమార్లు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత బంధు లబ్ధిదారులుగా నమోదు కావడంతో ఇతర సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ తుంగతుర్తి నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు.

పేదరికంలో జీవిస్తున్న తమకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేసి మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బాలెంల నరేందర్, ఇటుకాల ఆంజనేయులు, జిల్లా శివాజీ, జక్కుల గిరిబాబు, చెడిపల్లి రఘుపతి, అల్వాల శంకర్, బందెల శీను, ఇరుగు లక్ష్మణ్, నీలం నరేష్, ఎలిజాల అశోక్, బోనాల మహేందర్, చెరుకు మధు, సందీప్, కడియం నాగయ్య, బట్ట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News