దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన
దళిత బంధు నిధుల విడుదలలో ఆలస్యం… లబ్ధిదారుల ఆవేదన
Editor Desk
యాదాద్రి భువనగిరి, : దళిత బంధు పథకం కింద మంజూరైన నిధులను తక్షణమే విడుదల చేయాలని మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండో విడతలో భాగంగా 254 మంది లబ్ధిదారులకు రూ.3 లక్షలు జమ చేసినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా నిధులు నిలిచిపోయాయని తెలిపారు. గత రెండున్నరేళ్లుగా పలుమార్లు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత బంధు లబ్ధిదారులుగా నమోదు కావడంతో ఇతర సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ తుంగతుర్తి నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు.
పేదరికంలో జీవిస్తున్న తమకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేసి మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బాలెంల నరేందర్, ఇటుకాల ఆంజనేయులు, జిల్లా శివాజీ, జక్కుల గిరిబాబు, చెడిపల్లి రఘుపతి, అల్వాల శంకర్, బందెల శీను, ఇరుగు లక్ష్మణ్, నీలం నరేష్, ఎలిజాల అశోక్, బోనాల మహేందర్, చెరుకు మధు, సందీప్, కడియం నాగయ్య, బట్ట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి