Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

బాల్యస్నేహానికి బలమైన బంధం… నాగరాజు కుటుంబానికి లక్ష సాయం

బాల్యస్నేహానికి బలమైన బంధం… నాగరాజు కుటుంబానికి లక్ష సాయం

బాల్యస్నేహానికి బలమైన బంధం… నాగరాజు కుటుంబానికి లక్ష సాయం
March 23, 2026 12:46 AM 346 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అనారోగ్యంతో మృతిచెందిన ఐతరాజు నాగరాజు కుటుంబానికి ఆయన బాల్యమిత్రులు ఆదర్శంగా నిలిచారు. కష్టసమయంలో స్నేహబంధాన్ని చాటుతూ 1998-99 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి స్నేహితులు కలిసి రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

హనుమాన్ నగర్‌లోని నాగరాజు నివాసంలో స్నేహితులు కుటుంబ సభ్యులను పరామర్శించి నగదు సహాయం అందించారు. నాగరాజు ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న వేళ, తమ బాల్య స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ముందుకు వచ్చి ఈ సహాయం అందించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, “ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు… మా స్నేహానికి, బాధ్యతకు ప్రతీక. ఇలాంటి కష్టసమయంలో మనం ఒకటిగా నిలబడటం మన కర్తవ్యంగా భావించాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ, కృష్ణ, చిక్క శ్రీనివాస్, బాలకృష్ణ, సతీష్, వెంకటేష్, అశ్విన్, నాగార్జున్, సామి, రాజచంద్ర, ఆలమ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News