Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

హాస్టల్‌లో కమిషనర్ ‘నిద్ర’ పర్యవేక్షణ

హాస్టల్‌లో కమిషనర్ ‘నిద్ర’ పర్యవేక్షణ

హాస్టల్‌లో కమిషనర్ ‘నిద్ర’ పర్యవేక్షణ
30-03-2026 302 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యక్ష పరిశీలన

‘హాస్టల్ నిద్ర’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలం నేలపట్లలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాం రెడ్డి సోమవారం సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ పర్యటనలో, హాస్టల్‌లోని అన్ని సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు.హాస్టల్ అంతటా కలియతిరిగిన కమిషనర్, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకున్నారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువు ప్రాధాన్యతను విద్యార్థులకు స్పష్టంగా వివరించారు.హాస్టల్ వార్డెన్ కె. సుధాకర్‌కు పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా డైనింగ్ హాల్, బాత్‌రూమ్‌లు, హాస్టల్ ఆవరణను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.ఈ సందర్భంగా త్రాగునీటి సౌకర్యం, స్టోర్ రూమ్, రికార్డ్ రూమ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కమిషనర్, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఇటువంటి పర్యవేక్షణలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు.

Sthanikam

హాస్టల్‌లో కమిషనర్ ‘నిద్ర’ పర్యవేక్షణ

Article Image

విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యక్ష పరిశీలన

‘హాస్టల్ నిద్ర’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలం నేలపట్లలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాం రెడ్డి సోమవారం సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ పర్యటనలో, హాస్టల్‌లోని అన్ని సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు.హాస్టల్ అంతటా కలియతిరిగిన కమిషనర్, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకున్నారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువు ప్రాధాన్యతను విద్యార్థులకు స్పష్టంగా వివరించారు.హాస్టల్ వార్డెన్ కె. సుధాకర్‌కు పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా డైనింగ్ హాల్, బాత్‌రూమ్‌లు, హాస్టల్ ఆవరణను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.ఈ సందర్భంగా త్రాగునీటి సౌకర్యం, స్టోర్ రూమ్, రికార్డ్ రూమ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కమిషనర్, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఇటువంటి పర్యవేక్షణలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News