Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 10:42 PM

హాస్టల్‌లో కమిషనర్ ‘నిద్ర’ పర్యవేక్షణ

హాస్టల్‌లో కమిషనర్ ‘నిద్ర’ పర్యవేక్షణ

హాస్టల్‌లో కమిషనర్ ‘నిద్ర’ పర్యవేక్షణ
March 30, 2026 08:52 PM 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యక్ష పరిశీలన

‘హాస్టల్ నిద్ర’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలం నేలపట్లలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాం రెడ్డి సోమవారం సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ పర్యటనలో, హాస్టల్‌లోని అన్ని సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు.హాస్టల్ అంతటా కలియతిరిగిన కమిషనర్, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకున్నారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువు ప్రాధాన్యతను విద్యార్థులకు స్పష్టంగా వివరించారు.హాస్టల్ వార్డెన్ కె. సుధాకర్‌కు పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా డైనింగ్ హాల్, బాత్‌రూమ్‌లు, హాస్టల్ ఆవరణను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.ఈ సందర్భంగా త్రాగునీటి సౌకర్యం, స్టోర్ రూమ్, రికార్డ్ రూమ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కమిషనర్, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఇటువంటి పర్యవేక్షణలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News