హాస్టల్లో కమిషనర్ ‘నిద్ర’ పర్యవేక్షణ
హాస్టల్లో కమిషనర్ ‘నిద్ర’ పర్యవేక్షణ
K.RAVI
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యక్ష పరిశీలన
‘హాస్టల్ నిద్ర’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలం నేలపట్లలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాం రెడ్డి సోమవారం సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ పర్యటనలో, హాస్టల్లోని అన్ని సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు.హాస్టల్ అంతటా కలియతిరిగిన కమిషనర్, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకున్నారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువు ప్రాధాన్యతను విద్యార్థులకు స్పష్టంగా వివరించారు.హాస్టల్ వార్డెన్ కె. సుధాకర్కు పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా డైనింగ్ హాల్, బాత్రూమ్లు, హాస్టల్ ఆవరణను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.ఈ సందర్భంగా త్రాగునీటి సౌకర్యం, స్టోర్ రూమ్, రికార్డ్ రూమ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కమిషనర్, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఇటువంటి పర్యవేక్షణలు కొనసాగుతాయని కమిషనర్ తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి