Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:43 AM

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
17-03-2026 523 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పంతంగి టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. మంగళవారం జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు 60.685 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి ఆదేశాల మేరకు రామన్నపేట, మోత్కూర్ స్టేషన్ల అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో గంజాయి బయటపడింది.

అరెస్టైన నిందితులు మహారాష్ట్రకు చెందిన గంగా బాయ్ పాండు రంగ్ చౌహన్, కమల్ అర్జున్ మోహితే, విజయ్ ఆసారం గోరపడే మరియు నల్గొండకు చెందిన వల్లపు దాసు వేణుకుమార్‌గా గుర్తించారు. వీరు భరంపూర్ నుంచి గంజాయిని తరలించి, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర కు తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.25 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. గంజాయి తో పాటు ఒక ఆటో, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని, నిందితులను రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఆపరేషన్‌లో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కలిసి పాల్గొని సమన్వయంతో తనిఖీలు నిర్వహించడం ద్వారా ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Sthanikam

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

Article Image

పంతంగి టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. మంగళవారం జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు 60.685 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి ఆదేశాల మేరకు రామన్నపేట, మోత్కూర్ స్టేషన్ల అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో గంజాయి బయటపడింది.

అరెస్టైన నిందితులు మహారాష్ట్రకు చెందిన గంగా బాయ్ పాండు రంగ్ చౌహన్, కమల్ అర్జున్ మోహితే, విజయ్ ఆసారం గోరపడే మరియు నల్గొండకు చెందిన వల్లపు దాసు వేణుకుమార్‌గా గుర్తించారు. వీరు భరంపూర్ నుంచి గంజాయిని తరలించి, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర కు తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.25 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. గంజాయి తో పాటు ఒక ఆటో, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని, నిందితులను రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఆపరేషన్‌లో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కలిసి పాల్గొని సమన్వయంతో తనిఖీలు నిర్వహించడం ద్వారా ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News