Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:11 AM

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
March 17, 2026 08:25 PM 518 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పంతంగి టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. మంగళవారం జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు 60.685 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి ఆదేశాల మేరకు రామన్నపేట, మోత్కూర్ స్టేషన్ల అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో గంజాయి బయటపడింది.

అరెస్టైన నిందితులు మహారాష్ట్రకు చెందిన గంగా బాయ్ పాండు రంగ్ చౌహన్, కమల్ అర్జున్ మోహితే, విజయ్ ఆసారం గోరపడే మరియు నల్గొండకు చెందిన వల్లపు దాసు వేణుకుమార్‌గా గుర్తించారు. వీరు భరంపూర్ నుంచి గంజాయిని తరలించి, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర కు తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.25 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. గంజాయి తో పాటు ఒక ఆటో, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని, నిందితులను రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఆపరేషన్‌లో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కలిసి పాల్గొని సమన్వయంతో తనిఖీలు నిర్వహించడం ద్వారా ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News