Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీ గంజాయి స్వాధీనం – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
March 17, 2026 08:25 PM 514 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పంతంగి టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. మంగళవారం జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు 60.685 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి ఆదేశాల మేరకు రామన్నపేట, మోత్కూర్ స్టేషన్ల అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో గంజాయి బయటపడింది.

అరెస్టైన నిందితులు మహారాష్ట్రకు చెందిన గంగా బాయ్ పాండు రంగ్ చౌహన్, కమల్ అర్జున్ మోహితే, విజయ్ ఆసారం గోరపడే మరియు నల్గొండకు చెందిన వల్లపు దాసు వేణుకుమార్‌గా గుర్తించారు. వీరు భరంపూర్ నుంచి గంజాయిని తరలించి, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర కు తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.25 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. గంజాయి తో పాటు ఒక ఆటో, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని, నిందితులను రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఆపరేషన్‌లో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కలిసి పాల్గొని సమన్వయంతో తనిఖీలు నిర్వహించడం ద్వారా ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News