విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్ లకు ఏపీ ఎస్ ఈ బి రూల్స్ ను వర్తింపజేయాలి
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్ లకు ఏపీ ఎస్ ఈ బి రూల్స్ ను వర్తింపజేయాలి
Prabhakar
విద్యుత్ ఆర్టిసన్ల ఆందోళన ఉధృతం
రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం సైనిక్ పురి డివిజన్ మౌలాలి కార్యాలయాల ఎదుట ధర్నాను నిర్వహించి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం,యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు ఫలితం లేకపోవడంతో, తదుపరి పోరాట పటిమను పెంచేందుకు ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాక్ నాయకులు ఏప్రిల్ 2వ తేదీన సర్కిల్ కార్యాలయాల ఎదుట భారీ ధర్నా మరియు 'వంటా-వార్పు' కార్యక్రమం,ఏప్రిల్ 8న ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో, 8 ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిసన్ కార్మికులు అందరూ నిరవదిక సమ్మెకు దిగుతున్నట్లు స్పష్టం చేశారు.సంస్థ ఎదుగుదలకు నిరంతరం శ్రమిస్తున్న తమ సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు ఈ ఉద్యమం ఆగదు అని జాక్ నాయకులు పేర్కొన్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి చర్చలకు పిలవాలని,లేనిపక్షంలో జరిగే పరిణామాలకు అధికారులు,ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు పునరుద్ఘాటించారు.ఈ నిరసన కార్యక్రమంలో హబ్సిగూడ సర్కిల జేఏసీ ఏసీ చైర్మన్ వెంకట్ రెడ్డి, కో-కన్వీనర్ క్రిస్టోఫర్,బాల్ రెడ్డి,రంగు జానయ్య గౌడ్, ఉపేందర్ రెడ్డి,సంతోష్ రెడ్డి,యాదగిరి,మల్లా రెడ్డి, రాము,జానీ,రమ, మమత,సుగుణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి