Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:18 AM

ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు ఫెలోషిప్‌లు. వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు ఫెలోషిప్‌లు. వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు ఫెలోషిప్‌లు. వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
March 30, 2026 07:19 PM 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు అభ్యసిస్తున్న ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ముందుకు వచ్చింది. సమతా స్కీమ్ కింద ఫెలోషిప్‌ల రూపంలో ఈ సహాయం అందించనున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు ఫౌండేషన్ చైర్మన్, యూనివర్సిటీ పూర్వ విద్యార్థి దూదిపాల జ్యోతి రెడ్డి యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణిను కలిసి ప్రతిపాదనలు అందించారు. వరంగల్ జిల్లా మారుమూల గ్రామంలో వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించిన జ్యోతి రెడ్డి, అనంతరం ఇదే యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి, అంచెలంచలుగా ఎదిగి అమెరికాలో సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే.

తనకు జీవితంలో గుర్తింపు ఇచ్చిన విద్యాసంస్థకు తిరిగి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జ్యోతి రెడ్డి తెలిపారు. ఉన్నత విద్యకు దూరంగా ఉన్న ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ వర్గాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో ఫెలోషిప్‌లు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, త్వరలోనే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పూర్వ విద్యార్థి ముందుకు వచ్చి ఇతరుల విద్యాభివృద్ధికి తోడ్పడడం గర్వకారణమని, ఇది మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సమ్మి రెడ్డి, రిజిస్ట్రార్ డా. ఎల్.వి.కే. రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, వీసీ ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News