Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:12 PM

భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వద్దు – ముందస్తు చర్యలు తీసుకోవాలి : కుమ్మరి రాజు

భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వద్దు – ముందస్తు చర్యలు తీసుకోవాలి : కుమ్మరి రాజు

భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వద్దు – ముందస్తు చర్యలు తీసుకోవాలి : కుమ్మరి రాజు
March 30, 2026 07:45 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా, భక్తుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఏప్రిల్ 1 నుండి 6 వరకు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, తగిన స్థాయిలో భద్రతా ఏర్పాట్లు లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని సామాజిక కార్యకర్త కుమ్మరి రాజు హెచ్చరించారు.అడవి ప్రాంతం కావడం, కఠినమైన ట్రెక్కింగ్ మార్గం ఉండటం, అలాగే సన్నని దారులు కారణంగా భక్తులు ఒకేసారి పెద్ద సంఖ్యలో చేరుతుండటంతో తోపులాటలు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.గతంలో జరిగిన కొన్ని దుర్ఘటనలను గుర్తుచేస్తూ, ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా, జాతర సమయంలో కొంతమంది వ్యాపారులు భక్తులను అధిక ధరలకు వస్తువులు అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని, ముఖ్యంగా తాగునీటి బాటిళ్లను అధిక ధరలకు విక్రయించడం ఆపాలని కోరారు.

ఈ నేపథ్యంలో, కుమ్మరి రాజు తెలంగాణ సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయాన్ని సందర్శించి, ఎం.ఎస్.ఎస్ కార్యదర్శి సోమరాజుకు వినతి పత్రం అందజేశారు.దీనిపై స్పందించిన అధికారులు, సంబంధిత జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ అధికారులతో చర్చించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News