Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 09:34 PM

భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వద్దు – ముందస్తు చర్యలు తీసుకోవాలి : కుమ్మరి రాజు

భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వద్దు – ముందస్తు చర్యలు తీసుకోవాలి : కుమ్మరి రాజు

భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వద్దు – ముందస్తు చర్యలు తీసుకోవాలి : కుమ్మరి రాజు
March 30, 2026 07:45 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా, భక్తుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఏప్రిల్ 1 నుండి 6 వరకు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, తగిన స్థాయిలో భద్రతా ఏర్పాట్లు లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని సామాజిక కార్యకర్త కుమ్మరి రాజు హెచ్చరించారు.అడవి ప్రాంతం కావడం, కఠినమైన ట్రెక్కింగ్ మార్గం ఉండటం, అలాగే సన్నని దారులు కారణంగా భక్తులు ఒకేసారి పెద్ద సంఖ్యలో చేరుతుండటంతో తోపులాటలు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.గతంలో జరిగిన కొన్ని దుర్ఘటనలను గుర్తుచేస్తూ, ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా, జాతర సమయంలో కొంతమంది వ్యాపారులు భక్తులను అధిక ధరలకు వస్తువులు అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని, ముఖ్యంగా తాగునీటి బాటిళ్లను అధిక ధరలకు విక్రయించడం ఆపాలని కోరారు.

ఈ నేపథ్యంలో, కుమ్మరి రాజు తెలంగాణ సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయాన్ని సందర్శించి, ఎం.ఎస్.ఎస్ కార్యదర్శి సోమరాజుకు వినతి పత్రం అందజేశారు.దీనిపై స్పందించిన అధికారులు, సంబంధిత జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ అధికారులతో చర్చించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News