Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంది మండలం జుల్కల్ గ్రామంలో విషాద ఘటన – తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 01:08 AM

కంది మండలం జుల్కల్ గ్రామంలో విషాద ఘటన – తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి

కంది మండలం జుల్కల్ గ్రామంలో విషాద ఘటన – తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి

కంది మండలం జుల్కల్ గ్రామంలో విషాద ఘటన – తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి
March 28, 2026 11:34 PM 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంది మండలం పరిధిలోని జుల్కల్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూ టీమ్స్ సహాయంతో పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు.మృతురాలు మమతగా గుర్తించగా, ఆమె భర్త పట్నం ప్రవీణ్ గత జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ రోజు మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఇంటి దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.అయితే అసలు మరణ కారణాలపై స్పష్టత కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సమస్యలను ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో పంచుకోవాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని అవసరమైతే సహాయం పొందడం చాలా ముఖ్యమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News