కంది మండలం జుల్కల్ గ్రామంలో విషాద ఘటన – తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి
కంది మండలం జుల్కల్ గ్రామంలో విషాద ఘటన – తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి
Krishna
కంది మండలం పరిధిలోని జుల్కల్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూ టీమ్స్ సహాయంతో పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు.మృతురాలు మమతగా గుర్తించగా, ఆమె భర్త పట్నం ప్రవీణ్ గత జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ రోజు మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఇంటి దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.అయితే అసలు మరణ కారణాలపై స్పష్టత కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సమస్యలను ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో పంచుకోవాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని అవసరమైతే సహాయం పొందడం చాలా ముఖ్యమని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి