Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:21 AM

చిన్న కొండూరులో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం

చిన్న కొండూరులో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం

చిన్న కొండూరులో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం
March 27, 2026 08:01 PM 485 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీరాముడి ఆదర్శ జీవితం మానవాళికి దిక్సూచి – దేవాలయ అధ్యక్షుడు రాందాస్ గౌడ్

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరాముడి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు ఎరుకుల రాందాస్ గౌడ్ మాట్లాడుతూ, శ్రీరాముడి జీవితం మానవాళికి నిత్యనూతన సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.మర్యాదకు నిలువెత్తు రూపం, సత్యానికి చిరునామా, త్యాగానికి ప్రతిరూపం, ధైర్యానికి మారుపేరు శ్రీరాముడని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే ధర్మ మార్గంలో నడవడమేనని పేర్కొన్నారు.ఈ పవిత్ర సందర్భంగా భక్తులు శ్రీరాముడిని కేవలం పూజించడమే కాకుండా ఆయనలోని సహనం, ధైర్యం, ధర్మం, నిబద్ధత వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలని సూచించారు. మన ఆలోచనల్లో రాముడు, మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం ఉండేలా సంకల్పం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కళ్యాణోత్సవంలో భాగంగా రాందాస్ గౌడ్, సంధ్య దంపతులు శ్రీరామచంద్రునికి, సీతాదేవికి పుస్తెమెట్టలు సమర్పించి, పాదప్రక్షాళన చేసి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీరాముని ప్రార్థించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, ఉప సర్పంచ్ గడ్డం సత్తయ్య, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలను శాలువాలు కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News