Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 09:53 PM

చిన్న కొండూరులో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం

చిన్న కొండూరులో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం

చిన్న కొండూరులో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం
March 27, 2026 08:01 PM 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీరాముడి ఆదర్శ జీవితం మానవాళికి దిక్సూచి – దేవాలయ అధ్యక్షుడు రాందాస్ గౌడ్

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరాముడి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు ఎరుకుల రాందాస్ గౌడ్ మాట్లాడుతూ, శ్రీరాముడి జీవితం మానవాళికి నిత్యనూతన సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.మర్యాదకు నిలువెత్తు రూపం, సత్యానికి చిరునామా, త్యాగానికి ప్రతిరూపం, ధైర్యానికి మారుపేరు శ్రీరాముడని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే ధర్మ మార్గంలో నడవడమేనని పేర్కొన్నారు.ఈ పవిత్ర సందర్భంగా భక్తులు శ్రీరాముడిని కేవలం పూజించడమే కాకుండా ఆయనలోని సహనం, ధైర్యం, ధర్మం, నిబద్ధత వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలని సూచించారు. మన ఆలోచనల్లో రాముడు, మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం ఉండేలా సంకల్పం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కళ్యాణోత్సవంలో భాగంగా రాందాస్ గౌడ్, సంధ్య దంపతులు శ్రీరామచంద్రునికి, సీతాదేవికి పుస్తెమెట్టలు సమర్పించి, పాదప్రక్షాళన చేసి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీరాముని ప్రార్థించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, ఉప సర్పంచ్ గడ్డం సత్తయ్య, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలను శాలువాలు కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News