రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా ప్రభుత్వం శాసనసభ విప్లను అధికారికంగా ప్రకటించింది. పార్టీ కార్యకలాపాలు, సభా నిర్వహణను సమర్థంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలైన విజయరమణ రావు, యెన్నాం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశంలకు విప్ బాధ్యతలు అప్పగించడం విశేషం. వీరు సభలో పార్టీ విధానాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు సభ్యులను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు.
పార్టీ నాయకత్వం ఈ నియామకాల ద్వారా శాసనసభలో తమ బలం మరింత పటిష్టమవుతుందని భావిస్తోంది. ఇకపై జరిగే సమావేశాల్లో విప్లు సభ్యుల హాజరు, ఓటింగ్ విషయంలో క్రమశిక్షణను కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు.ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, విప్లుగా ఎంపికైన నేతలకు పార్టీ శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి