Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు

స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు

స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు
30-03-2026 180 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భాగ్యలక్ష్మి కుటుంబానికి అండగా నిలిచిన 10వ తరగతి స్నేహితులు

పులిపాటి భాగ్యలక్ష్మి అకాల మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. చిన్ననాటి స్నేహితురాలిని కోల్పోవడం పట్ల ఆమెతో కలిసి 10వ తరగతి చదివిన స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె వైద్య ఖర్చులకు తోడ్పాటుగా స్నేహితులు కలిసి రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు. స్నేహబంధం ఎంత బలంగా ఉంటుందో ఈ చర్య ద్వారా స్పష్టమైంది.ఆమె మరణానంతరం కూడా అదే స్నేహాన్ని నిలబెట్టుకుంటూ, అంత్యక్రియల ఖర్చులను పూర్తిగా భరించడం ద్వారా మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె నివాసంలో నిర్వహించిన అంత్యక్రియల్లో స్నేహితులు పాల్గొని, ఆమెకు చివరి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ ఉడుగు బాలకృష్ణ గౌడ్, జోర్కా నాగరాజు, యు వెంకటేష్ గౌడ్, ఎం పండు, ఐలమ్మ, రాంబాబు, ఆలం, డి రాజు, బి రమేష్, హైమావతి, ఎం శ్రీను, చి నాగరాజు, సబిత, అలివేలు, వనిత తదితరులు పాల్గొన్నారు. స్నేహం అంటే కేవలం మాటల్లో కాదు… అవసరమైన సమయంలో చేయూతగా నిలబడటమేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Sthanikam

స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు

Article Image

భాగ్యలక్ష్మి కుటుంబానికి అండగా నిలిచిన 10వ తరగతి స్నేహితులు

పులిపాటి భాగ్యలక్ష్మి అకాల మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. చిన్ననాటి స్నేహితురాలిని కోల్పోవడం పట్ల ఆమెతో కలిసి 10వ తరగతి చదివిన స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె వైద్య ఖర్చులకు తోడ్పాటుగా స్నేహితులు కలిసి రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు. స్నేహబంధం ఎంత బలంగా ఉంటుందో ఈ చర్య ద్వారా స్పష్టమైంది.ఆమె మరణానంతరం కూడా అదే స్నేహాన్ని నిలబెట్టుకుంటూ, అంత్యక్రియల ఖర్చులను పూర్తిగా భరించడం ద్వారా మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె నివాసంలో నిర్వహించిన అంత్యక్రియల్లో స్నేహితులు పాల్గొని, ఆమెకు చివరి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ ఉడుగు బాలకృష్ణ గౌడ్, జోర్కా నాగరాజు, యు వెంకటేష్ గౌడ్, ఎం పండు, ఐలమ్మ, రాంబాబు, ఆలం, డి రాజు, బి రమేష్, హైమావతి, ఎం శ్రీను, చి నాగరాజు, సబిత, అలివేలు, వనిత తదితరులు పాల్గొన్నారు. స్నేహం అంటే కేవలం మాటల్లో కాదు… అవసరమైన సమయంలో చేయూతగా నిలబడటమేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News