స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు
స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు
K.RAVI
భాగ్యలక్ష్మి కుటుంబానికి అండగా నిలిచిన 10వ తరగతి స్నేహితులు
పులిపాటి భాగ్యలక్ష్మి అకాల మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. చిన్ననాటి స్నేహితురాలిని కోల్పోవడం పట్ల ఆమెతో కలిసి 10వ తరగతి చదివిన స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె వైద్య ఖర్చులకు తోడ్పాటుగా స్నేహితులు కలిసి రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు. స్నేహబంధం ఎంత బలంగా ఉంటుందో ఈ చర్య ద్వారా స్పష్టమైంది.ఆమె మరణానంతరం కూడా అదే స్నేహాన్ని నిలబెట్టుకుంటూ, అంత్యక్రియల ఖర్చులను పూర్తిగా భరించడం ద్వారా మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె నివాసంలో నిర్వహించిన అంత్యక్రియల్లో స్నేహితులు పాల్గొని, ఆమెకు చివరి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ ఉడుగు బాలకృష్ణ గౌడ్, జోర్కా నాగరాజు, యు వెంకటేష్ గౌడ్, ఎం పండు, ఐలమ్మ, రాంబాబు, ఆలం, డి రాజు, బి రమేష్, హైమావతి, ఎం శ్రీను, చి నాగరాజు, సబిత, అలివేలు, వనిత తదితరులు పాల్గొన్నారు. స్నేహం అంటే కేవలం మాటల్లో కాదు… అవసరమైన సమయంలో చేయూతగా నిలబడటమేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి