Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:10 AM

చైర్‌పర్సన్ ఆదేశాలతో యాక్షన్ వలిగొండ రోడ్డుకు కొత్త రూపు

చైర్‌పర్సన్ ఆదేశాలతో యాక్షన్ వలిగొండ రోడ్డుకు కొత్త రూపు

చైర్‌పర్సన్ ఆదేశాలతో యాక్షన్ వలిగొండ రోడ్డుకు కొత్త రూపు
30-03-2026 1,014 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పట్టణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా వలిగొండ రోడ్డును త్వరితగతిన అభివృద్ధి చేస్తామని చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ తెలిపారు. గుంతలతో దెబ్బతిన్న రహదారి కారణంగా వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టినట్లు వెల్లడించారు.చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు, కమిషనర్ జి. వెంకట్రాం రెడ్డి ఆధ్వర్యంలో నేడు రోడ్డు ప్యాచ్ వర్క్ చేపట్టి, రాకపోకలకు అనువుగా మారుస్తున్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ…మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్లతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ, సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించి శాశ్వత రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.చిన్న చిన్న అడ్డంకులను అధిగమిస్తూ పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

నగర ప్రజల సౌలభ్యం కోసం మున్సిపల్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

Sthanikam

చైర్‌పర్సన్ ఆదేశాలతో యాక్షన్ వలిగొండ రోడ్డుకు కొత్త రూపు

Article Image

పట్టణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా వలిగొండ రోడ్డును త్వరితగతిన అభివృద్ధి చేస్తామని చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ తెలిపారు. గుంతలతో దెబ్బతిన్న రహదారి కారణంగా వాహనదారులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టినట్లు వెల్లడించారు.చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు, కమిషనర్ జి. వెంకట్రాం రెడ్డి ఆధ్వర్యంలో నేడు రోడ్డు ప్యాచ్ వర్క్ చేపట్టి, రాకపోకలకు అనువుగా మారుస్తున్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ…మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్లతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ, సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించి శాశ్వత రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.చిన్న చిన్న అడ్డంకులను అధిగమిస్తూ పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

నగర ప్రజల సౌలభ్యం కోసం మున్సిపల్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News