Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:09 AM

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ
March 30, 2026 06:42 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ పంపారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ… జిల్లా ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

భువనగిరి జిల్లాలో రామన్నపేట, ఆలేరు మండలాల్లో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల మండలాలైన బీబీనగర్, వలిగొండ, ఆత్మకూరు, మోటకొండూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సుమారు 5 వేల మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

భువనగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ధరావత్ జగన్ నాయక్, పుట్టల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News