భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ
భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ
Editor Desk
యాదాద్రి భువనగిరి, : భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ పంపారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ… జిల్లా ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
భువనగిరి జిల్లాలో రామన్నపేట, ఆలేరు మండలాల్లో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల మండలాలైన బీబీనగర్, వలిగొండ, ఆత్మకూరు, మోటకొండూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సుమారు 5 వేల మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
భువనగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ధరావత్ జగన్ నాయక్, పుట్టల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి