Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 08:40 PM

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ
March 30, 2026 06:42 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ పంపారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ… జిల్లా ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

భువనగిరి జిల్లాలో రామన్నపేట, ఆలేరు మండలాల్లో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల మండలాలైన బీబీనగర్, వలిగొండ, ఆత్మకూరు, మోటకొండూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సుమారు 5 వేల మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

భువనగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ధరావత్ జగన్ నాయక్, పుట్టల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News