బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు
బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు
K.RAVI
చెల్లింపులేని కంపెనీ జప్తు – కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణ
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో పన్ను బకాయిలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. డిస్కవరీ లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై భారీ ఆస్తి పన్ను బకాయిల కారణంగా ఈరోజు జప్తు చర్యలు చేపట్టారు.2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పన్నులు చెల్లించకపోవడంతో, మొత్తం రూ 6,42,740 బకాయి పేరుకుపోయిందని అధికారులు వెల్లడించారు. గతంలో పలుమార్లు రెడ్ నోటీసులు, షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించిన మున్సిపల్ కమిషనర్ స్వయంగా ఈ జప్తు ప్రక్రియను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…పట్టణ అభివృద్ధికి ఆస్తి పన్నులు ప్రధాన ఆదాయ వనరులని, పన్నులు చెల్లించని పక్షంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, వార్డు ఆఫీసర్ సలీం, బిల్ కలెక్టర్ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి