Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 10:32 PM

బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు

బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు

బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు
March 30, 2026 08:06 PM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చెల్లింపులేని కంపెనీ జప్తు – కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో పన్ను బకాయిలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. డిస్కవరీ లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై భారీ ఆస్తి పన్ను బకాయిల కారణంగా ఈరోజు జప్తు చర్యలు చేపట్టారు.2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పన్నులు చెల్లించకపోవడంతో, మొత్తం రూ 6,42,740 బకాయి పేరుకుపోయిందని అధికారులు వెల్లడించారు. గతంలో పలుమార్లు రెడ్ నోటీసులు, షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించిన మున్సిపల్ కమిషనర్ స్వయంగా ఈ జప్తు ప్రక్రియను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…పట్టణ అభివృద్ధికి ఆస్తి పన్నులు ప్రధాన ఆదాయ వనరులని, పన్నులు చెల్లించని పక్షంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, వార్డు ఆఫీసర్ సలీం, బిల్ కలెక్టర్ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News