Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:21 AM

బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు

బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు

బకాయిలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు
March 30, 2026 08:06 PM 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చెల్లింపులేని కంపెనీ జప్తు – కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో పన్ను బకాయిలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. డిస్కవరీ లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై భారీ ఆస్తి పన్ను బకాయిల కారణంగా ఈరోజు జప్తు చర్యలు చేపట్టారు.2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పన్నులు చెల్లించకపోవడంతో, మొత్తం రూ 6,42,740 బకాయి పేరుకుపోయిందని అధికారులు వెల్లడించారు. గతంలో పలుమార్లు రెడ్ నోటీసులు, షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించిన మున్సిపల్ కమిషనర్ స్వయంగా ఈ జప్తు ప్రక్రియను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…పట్టణ అభివృద్ధికి ఆస్తి పన్నులు ప్రధాన ఆదాయ వనరులని, పన్నులు చెల్లించని పక్షంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, వార్డు ఆఫీసర్ సలీం, బిల్ కలెక్టర్ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News