Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎస్ఎఫ్ఐ “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 07:12 PM

ఆషా వర్కర్ల అరెస్టులకు నిరసన… ఖమ్మంలో సిఐటియు ఆందోళన

ఆషా వర్కర్ల అరెస్టులకు నిరసన… ఖమ్మంలో సిఐటియు ఆందోళన

ఆషా వర్కర్ల అరెస్టులకు నిరసన… ఖమ్మంలో సిఐటియు ఆందోళన
March 30, 2026 05:10 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లో ఆషా వర్కర్లపై జరిగిన అరెస్టులను ఖండిస్తూ ఖమ్మంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శనివారం రాష్ట్ర రాజధానిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆషా వర్కర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోమవారం ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్డులో భారీగా ఆందోళన నిర్వహించారు.

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌కు చేరుకున్న వేలాది ఆషా వర్కర్లతో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బల్గూరి మదు, రాష్ట్ర కమిటీ సభ్యులు పెరుమాళ్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ఆషా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద భీమా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యల వల్లే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని గుర్తుచేశారు.

ఆషా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆషా వర్కర్లు బి. జ్యోతి, సుభద్ర, ఉమా, నాగమణి, శరభమ్మ, లీలావతి, సుజాత, లలిత, మమత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News