Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:10 PM

ఆషా వర్కర్ల అరెస్టులకు నిరసన… ఖమ్మంలో సిఐటియు ఆందోళన

ఆషా వర్కర్ల అరెస్టులకు నిరసన… ఖమ్మంలో సిఐటియు ఆందోళన

ఆషా వర్కర్ల అరెస్టులకు నిరసన… ఖమ్మంలో సిఐటియు ఆందోళన
March 30, 2026 05:10 PM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లో ఆషా వర్కర్లపై జరిగిన అరెస్టులను ఖండిస్తూ ఖమ్మంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శనివారం రాష్ట్ర రాజధానిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆషా వర్కర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోమవారం ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్డులో భారీగా ఆందోళన నిర్వహించారు.

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌కు చేరుకున్న వేలాది ఆషా వర్కర్లతో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బల్గూరి మదు, రాష్ట్ర కమిటీ సభ్యులు పెరుమాళ్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ఆషా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద భీమా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యల వల్లే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని గుర్తుచేశారు.

ఆషా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆషా వర్కర్లు బి. జ్యోతి, సుభద్ర, ఉమా, నాగమణి, శరభమ్మ, లీలావతి, సుజాత, లలిత, మమత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News