Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:41 PM

డిజిటల్ విధానంలో జనగణన-2027: ఇండ్ల గణనకు సిద్ధం కావాలి. భారతి హోళీకేరి

డిజిటల్ విధానంలో జనగణన-2027: ఇండ్ల గణనకు సిద్ధం కావాలి. భారతి హోళీకేరి

డిజిటల్ విధానంలో జనగణన-2027: ఇండ్ల గణనకు సిద్ధం కావాలి. భారతి హోళీకేరి
30-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇండ్ల గణన ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా నిర్వహించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కలిగి ఉండి, డిజిటల్ విధానంలో గణన చేపట్టాలని సూచించారు. దేశంలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు పూర్తిగా నమోదు చేయాలని పేర్కొన్నారు.

ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకాన్ని మండలాల వారీగా పూర్తి చేసి, ప్రతి 300 ఇళ్లకు లేదా 750-800 జనాభాకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించాలని సూచించారు. యాప్ నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించి గణన ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, జిల్లాలో ఇండ్ల గణన ప్రక్రియను అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయమ్మ, జిల్లా జనగణన అధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డిజిటల్ విధానంలో జనగణన-2027: ఇండ్ల గణనకు సిద్ధం కావాలి. భారతి హోళీకేరి

Article Image

యాదాద్రి భువనగిరి: జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇండ్ల గణన ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా నిర్వహించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కలిగి ఉండి, డిజిటల్ విధానంలో గణన చేపట్టాలని సూచించారు. దేశంలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు పూర్తిగా నమోదు చేయాలని పేర్కొన్నారు.

ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకాన్ని మండలాల వారీగా పూర్తి చేసి, ప్రతి 300 ఇళ్లకు లేదా 750-800 జనాభాకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించాలని సూచించారు. యాప్ నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించి గణన ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, జిల్లాలో ఇండ్ల గణన ప్రక్రియను అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయమ్మ, జిల్లా జనగణన అధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News