ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత
ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత
EDIGA NAVEENKUMAR
పెనుకొండ: ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధితో పాటు అభివృద్ధికి కూడా ఊతం లభిస్తోందని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గంలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే 61 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 73 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 220 గోకులం షెడ్లు, 139 నీటి తొట్టీలు పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పేదలకు 100 రోజుల ఉపాధి కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతోందన్నారు.
పనుల అమలులో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, లేబర్ శాతం పెంచి మరిన్ని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, పంట కాలువల శుభ్రత, నీటి సంరక్షణ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి