Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:56 AM

ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత

ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత

ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత
17-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధితో పాటు అభివృద్ధికి కూడా ఊతం లభిస్తోందని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గంలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికే 61 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 73 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 220 గోకులం షెడ్లు, 139 నీటి తొట్టీలు పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పేదలకు 100 రోజుల ఉపాధి కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతోందన్నారు.

పనుల అమలులో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, లేబర్ శాతం పెంచి మరిన్ని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, పంట కాలువల శుభ్రత, నీటి సంరక్షణ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత

Article Image

పెనుకొండ: ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధితో పాటు అభివృద్ధికి కూడా ఊతం లభిస్తోందని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గంలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికే 61 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 73 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 220 గోకులం షెడ్లు, 139 నీటి తొట్టీలు పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పేదలకు 100 రోజుల ఉపాధి కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతోందన్నారు.

పనుల అమలులో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, లేబర్ శాతం పెంచి మరిన్ని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, పంట కాలువల శుభ్రత, నీటి సంరక్షణ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News