Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 10:47 PM

ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత

ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత

ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వేగం పెంచాలి: మంత్రి సవిత
April 17, 2026 07:14 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధితో పాటు అభివృద్ధికి కూడా ఊతం లభిస్తోందని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గంలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికే 61 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 73 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 220 గోకులం షెడ్లు, 139 నీటి తొట్టీలు పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పేదలకు 100 రోజుల ఉపాధి కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతోందన్నారు.

పనుల అమలులో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, లేబర్ శాతం పెంచి మరిన్ని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, పంట కాలువల శుభ్రత, నీటి సంరక్షణ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News