ఎన్జీ కళాశాల చరిత్రలో తొలిసారి ప్రొఫెసర్ పదోన్నతులు.
ఎన్జీ కళాశాల చరిత్రలో తొలిసారి ప్రొఫెసర్ పదోన్నతులు.
స్థానికం బృందం
డా. సముద్రాల ఉపేందర్, డా. అంతటి శ్రీనివాసులకు ప్రొఫెసర్ హోదా
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. అంతటి శ్రీనివాసులులకు ప్రొఫెసర్ పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కళాశాల స్టాఫ్ క్లబ్ తరపున వారిద్దరినీ ఘనంగా సన్మానించారు. ఉన్నత విద్యాశాఖ నిబంధనల ప్రకారం వారి సుదీర్ఘ అనుభవం, విద్యారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ పదోన్నతులను కల్పించినట్లు తెలిపారు.
డెబ్బై ఏళ్ల నాగార్జున ప్రభుత్వ కళాశాల చరిత్రలో ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. విద్యార్థుల అభివృద్ధి, పరిశోధన కార్యక్రమాల్లో వీరిరువురు గత కొన్నేళ్లుగా విశేష కృషి చేస్తున్నారని సహచర అధ్యాపకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. పి. రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, అకాడమిక్ సమన్వయకర్త బత్తిని నాగరాజు, తెలుగు విభాగాధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, భౌతిక శాస్త్ర విభాగాధ్యక్షుడు డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఆంగ్ల విభాగాధ్యక్షుడు డా. వై.వి.ఆర్. ప్రసన్న కుమార్, చరిత్ర విభాగాధ్యక్షుడు డా. బట్టు కిరీటం, వాణిజ్య శాస్త్ర విభాగాధ్యక్షుడు డా. నాగరాజుతో పాటు అధ్యాపకులు డా. అనిల్ అబ్రహం, డా. బొజ్జ అనిల్ కుమార్, డా. బి. వెంకటేశ్వర్లు, డా. జ్యోత్స్న, డా. జి. భాగ్యలక్ష్మి, ఎన్. కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి